SWACHH BHARAT Updates 'స్వచ్చ భారత్ - స్వచ్చ విద్యాలయం'

11/10/2014 09:57

'స్వచ్చ భారత్ - స్వచ్చ విద్యాలయం' కార్యక్రక్రామం ఎండాడ పాఠశాలలో స్ఫూర్తి దాయకంగా నిర్వహించబడుతుంది.  ప్రతి తరగతి నుండి విద్యార్ధులతో స్వచ్చ కమిటీలు నియమించి పర్యవేక్షణ కొరకు ఉపాధ్యాయులు శ్రీ వి.వి. దేముడు, శ్రీమతి  రాధారాణి గార్లను ఇంచార్జీస్  గా నియమించడం జరిగింది. పాఠశాలలో తరగతి గదులను, ఆవరణను పరిశుభ్రం చేయడం జరిగింది. పాఠశాలను పరిశుభ్రం గా ఉంచడం విద్యార్ధులు, ఉపాధ్యాయులు బాధ్యతగా నిర్వహించడం మొదటనుండి అలవాటుగా ఉండడం వలన   స్వచ్చ విద్యాలయం స్పూర్తి మరింత ఉత్సహం నింపింది.  ఎండాడ గ్రామంలో  ప్రజలను, పిల్లల తల్లిదండ్రులను కూడా  స్వచ్చ భారత్ అభియాన్ లో భాగస్వాములను చేయడం కోసం మా పాఠశాల కృషి చేస్తుంది. అందుకోసం ర్యాలీలు నిర్వహించి, వీధులను శుభ్రం చేసి, వీధి కూడళ్ళలో మానవహారంగా ఏర్పడి స్వచ్చ భారత్ ప్రతిజ్ఞ చేస్తున్నాము. 

https://yendadaschool.weebly.com